అనంత పద్మనాభ స్వామి వ్రతం 2024
పరిచయం, అనంత పద్మనాభ స్వామి వ్రతం (Anantha Padmanabha Swamy Vratham 2024) ఒక పవిత్రమైన హిందూ వ్రతం. ఈ వ్రతం లక్ష్మీదేవి మరియు ఆది సేషుడు అవతారమైన అనంత పద్మనాభ స్వామి వారికి అర్పించబడుతుంది. ఈ వ్రతాన్ని ముఖ్యంగా భాద్రపద శుద్ధ చతుర్ధశి రోజున ఆచరిస్తారు.
అనంత పద్మనాభ వ్రతం పూజ సామాగ్రి (Ananta Padmanabha Vratam Pooja Pooja materials)
స్వామి వారి ఫోటో, నాలుగు ఎరుపు దారాలు, గోధుమపిండి ప్రసాదం, దర్భలతో సర్పమును తయారుచేయుము, లేదా దానిని వస్త్రముపై గీయవలెను, ఒక వస్త్రం మీద కుంకుమ పెట్టుకోవాలి, చమరం ఒకటి, కలశం ఒకటి, పసుపు గణపతి, పంచామృతాలు,
అనంత పద్మనాభ స్వామి వ్రతం ప్రారంభం మరియు ముగింపు డేట్ (Anantha Padmanabha Swamy Vrat Start and End Date)
అనంతపద్మనాభస్వామి వ్రతం 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చింది. ఇప్పుడు తెలుసుకుందాం.! శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్దశి తిధి.
చతుర్దశి తిధి ప్రారంభం, 16 సెప్టెంబర్ 2024 సోమవారం పూజ సమయం మధ్యాహ్నం, 01:15 pm నిమిషాల నుండి 17 సెప్టెంబర్ 2024 మంగళవారం మధ్యాహ్నం, 11:10 AM వరకు తిధి ఉంటుంది.
స్వామివారి నైవేద్యం,
అనంత పద్మనాభ స్వామి నై విద్యార్థులను తెలుసుకుందాం..! గోధుమ పిండితో లేదా గోధుమ నూకతో స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి. 7 రకాల నైవేద్యాలు కూడా స్వామివారికి సమర్పించుకోవాలి. పులిహోర దద్దోజనం పాయసం పానకం వంటి స్వామి వారికి పండ్లు పూలు స్వామివారికి ప్రసాదం స్వీకరించాలి,
అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవాల్సిన తేదీ
అనంత చతుర్దశి అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించవలసిన తేదీ, 17 సెప్టెంబర్ 2024 మంగళవారం రోజున నక్షత్రం శతభిషా పూజా సమయం మధ్యాహ్నం, 2:32 PM నిమిషాలకు వరకు ఉంటుంది.
ఈ సమయంలో మీరు స్వామివారికి పూజలు చేసుకోవచ్చు.
అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకోవాల్సిన తేదీ మరియు శుభ సమయం
అనంత చతుర్దశి వ్రతం ఆచరించడానికి శుభ సమయం మధ్యాహ్నం, 12:00 PM గంటలకు వరకు మీరు అయితే పూజలు చేసుకోవచ్చు, ఈ వ్రతం మధ్యాహ్నం పూట నిర్వహించుకోవాలి. కానీ ఈ సమయానికి చతుర్దశతిథి వెళ్ళిపోతుంది. సూర్యోదయ సమయానికి మనకి చతుర్దశి ఉంది. కావున ఈరోజు ఇంత చతుర్దశి గాని మీరు భావించాలి.
కాబట్టి ఈ సమయంలో మీరు చూసుకోవాలి. మీరు వేల పనిలో ఆఫీస్ కి వెళ్లే వేల అయితే పూజ సమయాలు ఉదయం. 5:04 AM నుండి 8:18 AM నిమిషాల వరకు మీరు అయితే పూజలు చేసుకోవాలి.
అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరిస్తే కుటుంబంలో శాంతి, సిరులు, ధన, ధాన్య సంపత్తి కలుగుతాయని విశ్వసిస్తారు. ఈ వ్రతం ముఖ్యంగా వివాహమైన జంటలు, తమ జీవితంలో సౌభాగ్యం మరియు ఐశ్వర్యం కొరకు ఆచరిస్తారు.
వ్రత విధానం
ఉదయాన్నే స్నానం చేసి, వ్రతం ఆచరించేవారు పొద్దున్నే లేవగానే ఇల్లు శుభ్రం చేసుకుని వారు తల స్థానాలు చేసుకొని కొత్త బట్టలు వేసుకొని వ్రతాన్ని ఆచరించాలి. శుద్ధంగా అలంకరించబడిన పూజా స్థలంలో పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి.
అనంత పద్మనాభ స్వామిని, కుంకుమ, పసుపు, అక్షింతలు, పువ్వులు, పానకాలు మరియు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలతో మరియు టెంకాయ పూలు పండ్లతో స్వామివారిని పూజిస్తారు.ఇతర పూజా ద్రవ్యాలు వాడి పూజిస్తారు.
సంకల్పం, వ్రతం చేసే ముందు శుద్ధంగా సంకల్పం చెబుతారు. ఇది మనసు యొక్క శ్రద్ధ మరియు అనంతపద్మనాభ స్వామి వ్రతం ఆచరించేవారు సంకల్పం ఏక శుద్ధితో చేసుకోవాలి. ఏ చెడు ఆలోచనలతో కాకుండా మంచి ఆలోచనలతో సంకల్పం చెప్పుకోవాలి. భక్తితో వ్రతం చేయాలని సంకల్పించడం.
అష్టదళ పద్మం, పూజ సమయంలో ఎనిమిది క్షీరాసాగరాలు (అష్టదళ పద్మం)తో కూడిన ఒక కల్పన చేస్తారు. అనంత పద్మనాభునికి అష్టదళ పద్మంలో నివాసం ఉందని విశ్వసిస్తారు.
అనంత వ్రత కథ, పూజ సమయంలో అనంత వ్రత కథను వినడం లేదా చదవడం చేస్తారు. ఈ కథలో అనంత పద్మనాభ స్వామి యొక్క కృప వల్ల భక్తులు పొందిన సౌభాగ్యం, సిరులు గురించి చెప్పబడుతుంది.
ప్రసాదం, వ్రతం ముగిసిన తర్వాత స్వామి వారికి నైవేద్యం సమర్పించి, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు.
వ్రత ఫలితాలు
ఈ వ్రతం ఆచరించడం ద్వారా అనేకమైన సౌభాగ్యం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ వ్రతం కడచిన వారు ద్రవ్య సంపత్తి, వివాహ సౌభాగ్యం పొందుతారని నమ్మకం.
అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది. ప్రాచీన కాలం నుండి ఆచరించబడుతున్నది. ఇది భక్తులకు విశేషమైన ప్రాధాన్యం కలిగిన వ్రతం.
అనంత పద్మనాభ స్వామి వ్రత కథ (Story of Anantha Padmanabha Swamy Vrata)
అనంత పద్మనాభ వ్రతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..! సౌర కార మహా మునులతో సుధా పౌరాణికుడు లోకంలో దారిద్ర నివారణకు ఒక అద్భుతమైన వ్రతం ఉంటుంది. అది చెబుతున్న వినండి. అని అన్నారు గురువు.
కాల కర్మ వసుమున పాండవులు అరణ్యవాసం సమయంలో శ్రీకృష్ణ భగవానుతో మేము అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాము, దానికి చక్కటి పలహారం ఇవ్వండి, అని అడిగారు. ఓ ధర్మరాజా పురుషులకు మరియు స్త్రీలకు సకల పాపాలను పోగొట్టే మరియు సకల సౌభాగ్యాన్ని ఇచ్చే ఒక వ్రతం ఉంది.
అది అనంత పద్మనాభ వ్రతం భద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున ఈ వ్రతం చేయవలెను, ఆ వ్రతం వల్ల మీకు శుభాలు మరియు పుత్ర మరియు వృద్ధి వ్యాపారులో మీరు లాభాలు పొందుతారు. సుఖశాంతులతో కలుగును, అని శ్రీకృష్ణుడు చెప్పారు.
ధర్మరాజు అనంతపద్మనాభ ఎవరు అని శ్రీకృష్ణుని అడిగాడు, ఓ ధర్మరాజా అనంత పద్మనాభం ఎవరో కాదు నేనే అని కృష్ణుడు బోధించెను, సృష్టి, సితి, లయ కారకుడు నేనే కాల గమన అర్జునుడు నేనే ఉదయాంతలో 14 రుద్రులు అష్ట వసువులు ఏక దంతా రుద్రులు ద్వాద శ రుద్రులు సప్త ఋషులు పూర్వ భక్తులు నాలో ఉన్నారు అని చెప్పారు. ధర్మరాజు అనంత పద్మ స్వామి వ్రతం చేస్తాము. ఎలా చేయాలి, అని అడిగారు.
వ్రత కథ పూజా విధానం,
పూర్వం లో వశిష్ట గోత్రానికి చెందినవారు. సుమంతుడు అనే బ్రాహ్మణుడు ఉండేవారు. ఆయనకి ఒక సుశీల అనే కూతురు ఉండేది. ఆ అమ్మాయి పుట్టిన కొంతకాలానికి తల్లి చనిపోతుంది. అనుష్టానానికి భంగం కలకోకుండా మళ్లీ వివాహం చేసుకుంటారు.
పెళ్లి అయిన కొంతకాలానికి చవితి తల్లి సుశీల అనే కూతురుని చాలా బాధలు పెడుతుంది. యుక్తవయసు వచ్చేసరికి కౌన్యుడు అనే ఒక యోగినికి వివాహం చేస్తారు, తండ్రి కూతురికి ఒక ఎర్రటి బట్టలు గోధుమపిండి కట్టి ఇచ్చి పంపిస్తారు.
కొత్త దంపతులు ఒక చెరువు దగ్గర మధ్యాహ్నం వేళ ఆగారు, అక్కడ ఐదుగురు ముత్తైదులు ఎర్రటి చీరతో ఒక వ్రతాన్ని చేశారు. అది ఏమిటి అని సుశీల అడగక, ఆ ముత్తయిదులు ఇలా చెప్పారు.
మేము చేసే వ్రతం అనంత పద్మనాభం వ్రతం అంటారు, ఈ వ్రతం భద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజున యువతని ఆచరించాలి, 14 తోరాలతో సిద్ధం చేసుకుని తర్వాత ఎర్ర చీర కట్టుకొని కలసస్థాపం చేస్తే ఆ జలాల్లోకి జమున నాదిని ఆవాహం చేసి, దర్భలతో ఒక సర్పం ఆకృతి చేసి దానిపైన నారాయణుని ఆవాహం చేయాలి.
తర్వాత శోడుప ఉపచారాలతో స్వామి వారిని ప్రార్థన చేసుకోవాలి. అనంత పద్మ స్వామి గోధుమ పిండితో నైవేద్యం సమర్పించుకోవాలి. సత్పురుషులకి అన్నదానం చేయాలి. ఇలా 14 సంవత్సరాలు చేసింది. ఆఖరి సంవత్సరం చేశాక, వ్రతం పూర్తయ్యాక 14 కుండలు దానం ఇస్తే గనక చతుర్దశ పురుషోర్ధాలు నెరవేరుతాయి. ఆ ముత్తయిదువు చెప్పింది.
తరచుగా అడిగే ప్రశ్న జవాబు
1. అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎవరు ఆచరించాలి.?
జవాబు, అనంత పద్మనాభ స్వామి వ్రతం ఆచరించేవారు. స్త్రీలు మరియు పురుషులు ఎవరైనా మరియు పెద్దలు మరియు పిల్లలు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
2, అనంత పద్మనాభ వ్రతం వల్ల కలిగే ఫలితలేవి.?
జవాబు, అనంత పద్మనాభ స్వామి వ్రతం చేయడం వల్ల వృద్ధి వ్యాపార అభివృద్ధికి తోడుపడుతుంది. కష్టాలు నుండి మీరు తొలగిపోతారు. అష్ట సౌకర్యంతో ఉంటారు.
3. అనంత పద్మనాభవ వ్రతం ఎన్ని సంవత్సరాలు చేయాలి లేదా ఎన్ని రోజులు చేయాలి.?
జవాబు, అనంత పద్మనాభ స్వామి వ్రతం 14 సంవత్సరాలు చేయాలి.? భద్రపదం శుక్లపక్ష చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం ఆరోజు మాత్రం చేయాలి. సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేయాలి. . అలా 14 సంవత్సరాల చేయాలి. చేయడం వల్ల మీకు అష్ట శుభాలు కలుగుతాయి. అని అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
4. ఉపన్యాసనం చేయాలా. లేదా ఎప్పుడు చేయాలి.?
జవాబు, అనంతపద్మనాభ స్వామి వ్రతం ఉపన్యాసనం ఎప్పుడు చేయాలంటే, 14 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఉపన్యాసనం చేయాలి. ఎలా చేయాలి అంటే 14 కుండలు నీళ్లు కుండలు దానం చేయాలి. అలా చేయడం వల్ల మీకు ఉపన్యాసనం చేస్తామని తెలుస్తుంది.
5, అనంత పద్మనాభ స్వామి వ్రతం డేటు మరియు రోజు.?
జవాబు, అనంత పద్మనాభ స్వామి వ్రతం రోజు 15 సెప్టెంబర్ శనివారం 2024 భద్రపద శుక్లపక్ష చతుర్దశి రోజు ఈ పూజలు చేయాలి.